చర్లపల్లి, ఏప్రిల్ 19 : అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ సాయినగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన నరేశ్ కుమారుడు అద్విక్ సంరక్షణ కోసం వారి కుటుంబ సభ్యులు రేటినేని వీరయ్య, కూన మహేశ్లకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రూ.50 వేలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం కాపు సంఘం ఇన్చార్జి గంధం నాగేశ్వర్రావు, రెడ్డి శ్రీనివాస్రావు, నాయకులు పసునూరి శ్రీకాంత్, పుప్పాల లక్ష్మీకాంతయ్య, సత్తయ్య, రెడ్డి శ్రీనివాస్, రాజబాబు, గుమ్మడి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.