సర్కిల్లో 52 ఇండ్లు గుర్తింపు
21 ఇండ్లు కూల్చివేత
మూడు ఇండ్ల యజమానులకు నోటీసులు
మల్కాజిగిరి, మే 24: వర్షాకాలంలో ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి కూల్చివేస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్లో 312కాలనీల్లో 1,03,198ఇండ్లలో దాదాపు ఐదు లక్షల మంది నివసిస్తున్నారు. అల్వాల్ సర్కిల్ పరిధిలో 186కాలనీలు, 37బస్తీల్లో 43,580ఇండ్లలో దాదాపు రెండున్నర లక్షల మంది నివసిస్తున్నారు. మల్కాజిగిరి, అల్వాల్ పట్టణాలు నాలుగు దశాబ్దాలుగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.అయితే గతంలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీగా ఉన్నప్పుడు చాలావరకు పెంకుటిండ్లు కట్టుకున్నారు. వీటితో పాటు నిర్మించిన ఇండ్లు, భవనాలు చాలావరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రతిసారి వర్షకాలంలో శిథిలాస్థకు చేరిన ఇండ్లు కూలి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్ పరిధిలోని మల్కాజిగిరి, నేరేడ్మెట్, గౌతంనగర్, మౌలాలీ, వినాయక్నగర్, ఈస్ట్ ఆనంద్బాగ్, అల్వాల్, వెంకటాపురం, మచ్చ బొల్లారం డివిజన్ల వారీగా అధికారులు ఇండ్లను సర్వే చేసి మల్కాజిగిరిలో52, అల్వాల్లో 3 శిథిలాస్థకు చేరిన ఇండ్లను గుర్తించారు.
శిథిలావస్థలకు చేరిన ఇండ్ల యజమానులకు నోటీసులు కూడా జారీచేశారు. మల్కాజిగిరి సర్కిల్లో 52ఇండ్లలో 21ఇండ్లను కూల్చివేశారు. అల్వాల్లో రెండు సంవత్సరాల క్రితం 32 ఇండ్లలో 15ఇండ్లకు మరమ్మతులు చేయించుకున్నారు. 5ఇండ్లను కూల్చివేశారు.మరో 5ఇండ్లను సీజ్చేశారు. 7ఇండ్లను కూల్చివేశారు. మరిన్ని శిథిలావస్థలకు చేరిన ఇండ్లను కూల్చి వేయనున్నారు.
ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నాం..
వర్షాకాలంలో శిథిలాస్థలకు చేరిన ఇండ్లు కూలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే ముందస్తుగా శిథిలాస్థకు చేరిన 52ఇండ్లను గుర్తిం చి యజమానులకు నోటీసు లు ఇచ్చాం. మల్కాజిగిరి సర్కి ల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారులు 9 డివిజన్లలోని కాలనీలు, బస్తీలలోని ఇండ్లను సర్వేచేసి 55 శిథిలాస్థలకు చేరిన ఇండ్లను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేశారు. అధికారులకు ప్రజలు సహకరించాలి.
–రాజు,డిప్యూటీ కమిషనర్-మల్కాజిగిరి సర్కిల్