సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరుగనున్నది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే నాల్గవ కౌన్సిల్ సమావేశంలో ఇటీవల ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమిటీకి సంబంధించి 20 అంశాలను కౌన్సిల్లో ఆమోదించనున్నారు. కొన్ని అంశాలను ప్రభుత్వ అనుమతికి అందజేయనున్నారు.
ఈ సమావేశంలో అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం కల్పించనున్నారు. పలు అభివృద్ధి పనులు, పెండింగ్ సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న దాదాపు 28 అపరిష్కృత సమస్యలపై చర్చ జరుగనున్నది.