హైదరాబాద్ : జీహెచ్ఎంసీ బడ్జెట్(GHMC budget) సమావేశం రేపటికి వాయిదా పడింది. ప్రకటనలపై పూర్తి నివేదిక ఇవ్వా లని కమిషనర్కు మేయర్ గద్వాల విజయలక్ష్మి(Mayor Vijayalakshmi )ఆదేశించారు. విచారణ కోసం ప్రత్యేక అధికారిని నియ మించాలని ఆదేశించారు. కాగా, అంతకు ముందు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభం కాగానే జీహెచ్ఎంసీ 8వ పాలకమండలి సమావేశంలో పీవీకి భారతరత్న ఇవ్వండంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం కార్పొరేటర్లు అధికారుల పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో వెళ్లి సమస్యలు ప రిష్కరించకుండానే సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. సమాచారం ఇవ్వకుండానే జోనల్ సమావేశాలు పెడుతున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ.8437 కోట్లుగా ఖరారు చేశారు. అలాగే రెవెన్యూ ఆదాయం రూ.5938 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.3458 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.2,480 కోట్లు, కాపిటల్ నిధులు రూ.1,999 కోట్లు, కాపిటల్ వ్యయం రూ. 4,479 కోట్లుగా జీహెచ్ఎంసీ తెలిపింది. అలాగే హౌసింగ్ కోసం ప్రత్యేకంగా రూ.500 కోట్లు కేటాయించినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది.