HYDRAA | హైదరాబాద్ : హైదరాబాద్లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం సర్వే నంబర్ 397లో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొగిస్తున్నారు.
ఈ సందర్భంగా బాధిత మహిళలు బోరున విలపించారు. కుక్కల మాదిరి రోడ్డున పడ్డామని కన్నీరు పెట్టుకున్నారు. హైడ్రా మీద మన్నువడ.. మమ్మల్ని సంపుతున్నరు అని శాపనార్థాలు పెట్టారు. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు.. ఆ ఇల్లు లేదు, ఉన్న రేకుల గుడిసెను కూడా కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పండుగ పూట మమ్మల్ని ఏడిపిస్తున్నారు. ఈ మొగోళ్ళను పంపడం కాదు.. రేవంత్ రెడ్డి వచ్చి మాతో మాట్లాడాలి. ఓట్లు వేయించుకుని గెలిచి ఇండ్ల కూర్చోవడం కాదు. దమ్ముంటే ఇక్కడికి రేవంత్ రెడ్డి రావాలి. పోలీసోళ్లతోన బతుకమ్మ ఆడుతున్నాం.. పోలీసోళ్లు లాఠీలతో కొట్టి బతుకమ్మ ఆడిస్తున్నారు అని మహిళలు పేర్కొన్నారు.
పండుగ పూట మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. చిన్న గుడిసె వేసుకొని బ్రతుకుతుంటే దాన్ని కూడా కూల్చేశారు. పండుగ పూట మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తలేరు. రేవంత్ రెడ్డి మా దగ్గరికి వస్తే రాళ్లు తీసుకొని కొడతామని గాజులరామారం హైడ్రా బాదితుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైడ్రా మీద మన్నువడ.. మమ్మల్ని సంపుతున్నరు
మాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు.. ఆ ఇల్లు లేదు, ఉన్న రేకుల గుడిసెను కూడా కూల్చేశారు https://t.co/tmoFtqSnkV pic.twitter.com/AbuKnK1auh
— Telugu Scribe (@TeluguScribe) September 21, 2025