జహీరాబాద్ : పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.94కోట్లు మోసానికి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బ్యాంకు మేనేజర్ జగదీశ్, క్యాషియర్ ఆకుల రాజుల కలిసి రూ.94 లక్షలు ఖాతాదారుల అకౌంట్ల నుంచి ఆన్లైన్లో మళ్లించారని జహీరాబాద్ డీఎస్పీ శంకర్రావు పేర్కొన్నారు. శనివారం జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్గా పని చేస్తున్న జగదీశ్ క్యాషియర్గా పని చేస్తున్న ఆకుల రాజు ఖాతాదారులకు చెందిన చెక్కులు, వోచర్లు లేకుండా నేరుగా డబ్బులు ఇతర ఖాతాలోకి మళ్లించారు. ఖాతాదారులు ఫిర్యాదు చేయడంతో పట్టణ ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇద్దరి నుంచి రూ.24.03లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ సీఐ తోట భూపతి, ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.