హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్లో లేడీ గెలవాలా? రౌడీ గెలవాలా? ప్రజలు తేల్చుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. ఎదురీతకు లేడీ నిలుచుంటే.. అటు దికు రౌడీ నిలుచున్నారని చెప్పారు. తన ఇల్లు ఇక్కడి నుంచి పది నిమిషాల దూరంలో ఉన్నదని, మీ బస్తీ సమస్యలను పరిషరించేందుకు ఏ ఆపద ఉన్నా, ఏ పని పడ్డా సునీతమ్మ ఒక్కరే కాకుండా తామందరం ఆమె కోసం అండగా ఉంటామని, సేవ చేస్తామని భరోసా ఇచ్చారు. పేదల ఇండ్లు కూల్చడానికి హైడ్రా బుల్డోజర్ వస్తే దానికి అడ్డంగా నిల్చుంటామని హామీ ఇచ్చారు.
బోగస్ ఓట్లు, దొంగ ఓట్లతో గెలవాలని కాంగ్రెసోళ్లు చూస్తున్నారని, పొద్దున్నే 6 గంటలకు లైన్లో నిల్చోని కారు గుర్తు మీద మీట నొక్కాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్పేట అంబేద్కర్నగర్లో శనివారం రాత్రి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో హరీశ్రావు మాట్లాడారు. మీరందరూ ఇష్టపడి గెలిపించుకున్న గోపీనాథ్ దురదృష్టవశాత్తు అనారోగ్య కారణంగా చనిపోయారని, మగ దికు లేని ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉందని చెప్పారు. భర్త లేని సంసారానికి ఎన్ని తిప్పలు ఉంటాయో మనకు తెలియదా? బాధతో, దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, సునీతమ్మను అవహేళన చేసిన కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజలకు, బస్తీ వాసులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్లోని ఓటర్లు కాంగ్రెస్కు కర్రు కాల్చివాత పెట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
కొడంగల్ నుంచి జనాలు..
ముఖ్యమంత్రి రోడ్ షోలకు జూబ్లీహిల్స్ ప్రజలు రావడం లేదని కొడంగల్ నుంచి జనాలను తరలిస్తున్నారని హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు రూ.2,500 ఇస్తామని ఇవ్వకుండా మోసం చేశారని, అవి రావాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘కేసీఆర్ మాటల మనిషి. రూ.200 పెన్షన్ను రూ.2,000 చేశారు. ఆడబిడ్డ కాన్పుకైతే కేసీఆర్ కిట్టు తెచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించింది ఎవరు? బతుకమ్మ చీరలు ఇచ్చింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇంటింటికి నల్ల ద్వారా తాగే నీళ్లు ఇచ్చింది కేసీఆర్.. కరెంటు కోతలు లేకుండా చేసింది కేసీఆర్..
రేవంత్రెడ్డి ఏం చేశాడు? హైడ్రా తేవడం తప్ప?’ అని ప్రశ్నించారు. ఈ అంబేదర్ నగర్లో కూడా హైడ్రా నోటీసులు ఇచ్చారు. నోటీస్ ఇచ్చాక కూడా కాంగ్రెస్కు ఓటేస్తే ఇల్లు కూలగొట్టడానికి అనుమతిచ్చారని రేవంత్రెడ్డి అనుకుంటారు. ఇల్లు కూలగొడతాం అన్నాక కూడా ఎవరైనా ఓటు వేస్తారా? రేవంత్రెడ్డి హైదరాబాదులో ఇండ్లు కూల్చడం తప్ప ఒకరికైనా ఇల్లు కట్టాడా? కేసీఆర్ లక్ష ఇండ్లు కడితే రేవంత్రెడ్డి లక్ష ఇండ్లను కూలగొట్టిండు’ అని విమర్శించారు.
అరాచక పాలనకు చరమగీతం పాడాలి
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తేనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలవుతాయని హరీశ్రావు భరోసా ఇచ్చారు. ‘రేవంత్రెడ్డిని ఓడిస్తే మహబూబ్నగర్లోని అవ్వ రూ.4000 పెన్షన్ వస్తుందని ఎదురుచూస్తున్నది.. నల్లగొండ చెల్లి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడగొడితే రూ.2,500 వస్తాయని ఎదురుచూస్తున్నది.. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడగొడితే కరీంనగర్లో రైతన్న రూ.15 వేల రైతుబంధు వస్తదని ఎదురుచూస్తున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద చదువుకొనే విద్యార్థులకు సాలర్షిప్ ఇవ్వడం లేదు రేవంత్రెడ్డి. కరోనా వచ్చినా, కష్టం వచ్చినా ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ విద్యార్థులకు అందించింది కేసీఆర్ ప్రభుత్వం. కరోనా సమయంలో కేసీఆర్ కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. రేవంత్రెడ్డి మాటలకు మీ చేతలతో సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో రేవంత్రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలి’ అని పిలుపునిచ్చారు.
ముస్లిం సోదరులు ఓటుతో బుద్ధి చెప్పాలి
రోడ్ రోలర్కు, చపాతీ మేకర్కు ఓట్లు పోతాయని రేవంత్రెడ్డికి దింపుడు కళ్లం ఆశ. సునీతమ్మ ఫొటోతో కారు గుర్తుకు మూడో నంబర్ మీద ఓటు వేయండి. ఓటుకు రూ.5,000 ఇవ్వడం కాదు మహాలక్ష్మి కింద చెప్పినట్టు నెలకు రూ.2,500 చొప్పున రెండేండ్లకు రూ.60 వేలు ప్రతి మహిళకు ఇవ్వాలి. నేను అంబేదర్ బస్తీ వాసులకు మాటిస్తున్న.. మీరందరూ సునీతమ్మని గెలిపించండి. ఏ బుల్డోజర్ వస్తదో నేను చూస్తా. ఒక సీటి కొడితే పావుగంటలో వచ్చి బుల్డోజర్కి అడ్డంగా నిల్చుంటా. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే బుల్డోజర్ ఉండదు. కాంగ్రెస్ ఉండదు. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరని అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్ కంటే ముందు ముస్లింలు ఉన్నారు. కాంగ్రెస్ ఖతమైన తర్వాత కూడా ముస్లింలు ఉంటారు. రేవంత్రెడ్డికి ముస్లిం సోదరులు ఓటుతో సమాధానం చెప్పాలి’ అని పిలుపునిచ్చారు.