Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): మహా శివరాత్రి, షబ్- ఈ -మేరజ్ (జగ్నే కి రాత్) సందర్భంగా శనివారం రాత్రి 10 గంటల తర్వాత (18/19 తేదీ) నగరంలోని నెక్లెస్ రోడ్డుతో సహా అన్ని ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెలిపారు.
గ్రీన్ల్యాండ్స్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే, లంగర్హౌస్ ఫ్లై ఓవర్లకు మినహాయింపు ఉంటుందన్నారు. ఆయా రూట్లలో వెళ్లే వారు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని, అత్యవసరమైతే ట్రాఫిక్ పోలీస్ హెల్ప్లైన్ (9010203626)ను సంప్రదించాలని సూచించారు.