హైదరాబాద్ : హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్కు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎడతెగని వర్షాలతో హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కూకట్పల్లి నాలా నుంచి సాగర్కు భారీగా వరద పోటెత్తింది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 513.49 మీటర్లు కాగా, పూర్తి స్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు. ఈ నేపథ్యంలో సాగర్ నుంచి తూముల ద్వారా బయటకి నీటిని విడుదల చేస్తున్నారు. నిండు కుండలా మారిన హుస్సేన్సాగర్ అత్యంత పటిష్టంగా ఉందని, జీహెచ్ఎంసీ, నీటి పారుదల శాఖ విభాగం ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.