ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 6: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలను ఈనెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఓయూ పరిధిలోని ఎంఫిల్ ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ పరీక్షా తేదీలను మార్చినట్లు ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు మొదటి, రెండో సంవత్సరం పరీక్షలను ఈనెల 24 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఓయూ పరిధిలోని పలు కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏఎం, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సుల అన్ని సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. ఈ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు ఒక్కో పేపర్కు రూ.700 చొప్పున చెల్లించి ఈనెల 14వ తేదీలోగా ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జవాబు పత్రాల నకలు పొందాలనుకొనేవారు ఒక్కో పేపర్కు రూ.1000 చొప్పున చెల్లించి ఈనెల 27వ తేదీ వరకు తమ కార్యాలయంలో చెల్లించాలని పేర్కొన్నారు.
ఓయూ పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, మొదటి, మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు.