పహాడీషరీఫ్, ఏప్రిల్ 3: పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని బాలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ భాస్కర్ కోరారు ఆదివారం పోలీస్స్టేషన్ ఆవరణలో కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులతో కలిసి రంజాన్, శ్రీరామ నవమి పండుగలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సైలు లింగస్వామి, సైదులు, హరీందర్, కౌన్సిలర్లు శంషుద్దీన్, సయ్యద్ యాహియా, హాజీ నవాబ్ తదితరులు పాల్గొన్నారు.
మట్టి రోడ్డుకు మరమ్మతు..
రంజాన్ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మసీదుల వద్ద పారిశుధ్యం, రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జి.పి. కుమార్ పనులను పరిశీలించారు. ఆదివారం 11వ వార్డులోని ఆల్ జాబ్రీ కాలనీ, న్యూ బాబానగర్లో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. కౌన్సిలర్ హజీ నవాబ్ పరిశీలించారు.