‘కాంగ్రెసోళ్ల మాటలు అస్సలు నమ్మొద్దు. నమ్మి ఓటేస్తే రైతులు నట్టేట మునుగుడు ఖాయం. 3 గంటల కరెంట్..10 హెచ్పీ మోటర్లు అంటూ వ్యవసాయ రంగంపై ఆ పార్టీ నేతలు నిర్లక్ష్యపు ప్రకటనలు చేస్తున్నారు. మూడు గంటల కరెంట్తో ఒక మూల మడి కూడా తడవదు. 10 హెచ్పీ మోటర్లతో రైతులపై మోయలేని భారం పడుతుంది. కాంగ్రెస్కు ఓటేస్తే వ్యవసాయం నాశనమవుతుంది’.. అని అన్నదాతలు అన్నారు.
తెలంగాణ రాక ముందు ఉండే రోజులను గుర్తుకు తెచ్చేలా కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 గంటల కరెంటుతో సాగు చేయడం సాధ్యమవుతుందా..? అని ప్రశ్నిస్తున్నారు. 10 హెచ్పీ మోటర్లు అమర్చుకోవడం చాలా కష్టమని, అంత డబ్బును రైతులు ఖర్చు చేయలేరన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడు వచ్చేదో.? ఎప్పుడు పోయేదో..? తెల్వకపోయేదన్నారు.
ధరణి పోర్టల్ను ఎత్తివేస్తామంటూ.. రైతుల భూములకు రక్షణ లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎవుసానికి 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నదని, ధరణి పోర్టల్తో భూములు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ చెప్పే మాయమాటలు నమ్మమని, మళ్లీ బీఆర్ఎస్నే గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు..
కాంగ్రెస్ రైతు నాశనాన్ని కొరుకొని అధికారంలోకి రావాలనుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆలోచించి రైతులను ఆదుకునేందుకు అన్ని రకాలుగా సాయాన్ని అందిస్తున్నారు. దీంతో అన్నదాతలు ఆనందంగా పంటలను పండించుకుంటున్నారు. అయితే వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ నాయకులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయం నాశమవుతుంది. భూముల ధరలు తగ్గుతాయి. రైతులను ఆగం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ను ఎట్టి పరిస్థితుల్లో రానివ్వం.
– చిలుముల ఆశీష్రెడ్డి, రైతు, ఎదులాబాద్
సాగు విస్తీర్ణం తగ్గుతుంది..
వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ నాయకులు నిర్లక్ష్యంగా ప్రకటనలు చేస్తున్నారు. 3 గంటల కరెంటుతో పంటలకు నీళ్లు అందక సాగు విస్తీర్ణం పడిపోతుంది. 10 హెచ్పీ మోటర్లతో ఆర్థికంగా రైతులకు భారం పడుతుంది. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంటుతో పడావుగా ఉన్న భూముల్లో రైతులు వ్యవసాయం చేస్తూ.. ఆర్థికంగా ఎదుగుతున్నారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుంది. ధరణితో రైతుల భూములకు భద్రతగా ఉంటే కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదనిపిస్తున్నది.
– ఇంద్రాసేనారెడ్డి, కేశవరం
రైతులకు ఇబ్బందులే..
వ్యవసాయ సాగు విస్తీర్ణం తగ్గితే రైతులకు ఇబ్బందులే. వ్యవసాయంపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయి. రైతుబంధుపై ద్వంద్వ వైఖరి చూస్తుంటే.. భూ యజమానులు, కౌలు రైతుల మధ్య కోట్లాటలు తెచ్చే విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. వ్యవసాయం అభివృద్ధి చెంది రైతులు ఆనందంగా ఉంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వ్యవసాయ భూముల ధరలు పడిపోయే విధంగా సాగు విస్తీర్ణం తగ్గించాలని చూస్తున్నట్లు ఉన్నది. 3 గంటల కరెంటు ఇస్తే వ్యవసాయం సాగదు.
– శ్రీశైలం గౌడ్, రాంపల్లి
పండుగలా ఎవుసం
తెలంగాణ వచ్చినంకే ఎవుసం పండుగలా మారింది. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడొస్తుందో తెలియక… వచ్చిన కరెంటుతో గుంట భూమి కూడా పారకపోవడంతో అప్పులపాలయ్యేవాళ్లం. సీఎం కేసీఆర్ సార్ వచ్చినంక రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంటు, రైతు బంధు, రైతు బీమా ఇస్తుండటంతో పట్నం నుంచి పల్లెకు వచ్చి రెండు పంటలు పండుగలా పండించుకోగలుగుతున్నాం. కాంగ్రెస్ మూడు గంటల కరెంటు..10 హెచ్పీ మోటర్లు పెడుతామనడం విడ్డూరంగా ఉన్నది.
– బూరుగు మల్లయ్య, అంబేద్కర్నగర్
కాంగ్రెస్కు బుద్ధి చెబుతాం..
ధరణి తీసుకురావడంతోనే లంచాలు లేకుండా 10 నిమిషాల్లోనే భూమి రిజిస్ట్రేషన్ అవుతున్నది. ధరణి తీసేస్తామంటున్న కాంగ్రెసోళ్లను రైతులంతా తరుముతారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నో బాధలు పడ్డాం. తహసీల్దార్ ఆఫీసుల్లో ఒకరి భూమి ఇంకొకరికి రాసేటోళ్లు. భూముల సమస్యలతో దాడులు చేసుకొని కేసుల పాలయ్యేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంకే సీఎం కేసీఆర్ సార్ పేదల గోసను అర్థం చేసుకొని ధరణి తీసుకొచ్చారు. సెల్ఫోన్లోనే భూముల సంగతి తెలుసుకుంటున్నాం. భూముల ధరలు భారీగా పెరిగాయి.
– కిష్టయ్య, జ్యోతిరావుపూలే కాలనీ, జవహర్నగర్
కౌలుదారి విధానంతో నష్టమే..
తెలంగాణ రాకముందు కౌలుదారి విధానంలో రైతులకు భూమి ఉన్నా హక్కులు లేని పరిస్థితి ఉండే. ప్రస్తుతం తహసీల్దార్ ఆఫీసులోనే రిజిస్ట్రేషన్, బదలాయింపు ఒకేసారి జరుగుతున్నాయి. పంట దిగుబడులు పెరగడంతో భూములకు విలువ భారీగా పెరిగింది. పట్వారీల హయాంలో తర్వాత వీఆవ్వోల జమానాలో ఇష్టం వచ్చినట్టు రికార్డులు మార్చడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగేది. కౌలుదారి విధానాన్ని తీసుకొస్తే కబ్జాలు, గొడవలు పెరుగుతాయి. రైతులకు మరింత సాయం అందాలంటే బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి.
– మల్లేశ్, గండిమైసమ్మ, మేడ్చల్ జిల్లా
కాంగ్రెస్ పాలనను మర్చిపోం
మెరుగ్గా పంటలు పండించుకోవాలంటే 24 గంటలూ కరెంటు ఉండాల్సిందే. కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లు 3 గంటల కరెంటు ఇస్తే పంటలు ఎండిపోవాల్సిందే. బోర్లలో నీళ్లున్నా పారించుకోలేక జనరేటర్లు, ట్యాంకర్లు పెట్టుకుని డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇదే జరిగితే పొలాలు బీళ్లుగా మారడమో, విలువపడిపోవడమో జరుగుతాయి. ఆర్థికంగా నష్టపోయిన రైతులు అయినకాడికి తెగనమ్ముకుని కూలీపనులకో, వలసపోవడమో జరుగుతాయి. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎట్లా ఉండేదో రైతులు ఇంకా మర్చిపోలేదు.
– మల్లేశ్ యాదవ్, దుండిగల్, మేడ్చల్ జిల్లా
మళ్లీ కేసీఆరే రావాలి
రైతులకు సాయం అందిస్తున్న కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావాలి. రైతులతో పాటు అన్నివర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ రైతులు, పేదలకు సాయం చేసేందుకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ధరణి, నిరంతర కరెంటు , రైతుబంధుతో వ్యవసాయం మెరుగైంది. ధరణితో భూములు భద్రంగా ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో భూముల గొడవలతో తరాలు మారినా.. తలరాత మారేది కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో ఆన్లైన్లో పనులు అవుతున్నాయి.
– సీహెచ్ నాగేశ్, దుండిగల్, మేడ్చల్ జిల్లా