మూడు గంటల కరెంట్తో వ్యవసాయం ఎలా చేస్తారు. 10 హెచ్పీ మోటర్లు బిగించి.. కాంగ్రెస్ ఇస్తన్న కరెంట్తో ఒక్క మడికి కూడా నీళ్లను పారించలేము. సాగుపై కాంగ్రెస్ నాయకులకు అసలు అవగాహన ఉందా? మళ్లీ ఎనకటి రోజులు తీసుకొచ్చి… రైతులను ఏం చేయాలనుకుంటున్నరు? అని రైతులు ఆ పార్టీ నాయకుల ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ యజమానులు, కౌలు రైతుల మధ్య కొట్లాటలు పెట్టే విధంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రకటనలు చేస్తుండటంతో రైతులు భగ్గుమంటున్నారు. అధికారంలోకి రాకముందే ఇలా ఉంటే … వస్తే అన్నదాతల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 24 గంటలు కరెంటు, రైతుబంధుతో సాగును ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ వైపే తామంతా అని రైతులు చెబుతున్నారు.
– మేడ్చల్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ వస్తే… మళ్లీ వలసలు వెళ్లే పరిస్థితులు రైతులకు తెచ్చేలా ఉన్నారు. ఆ పార్టీ నాయకులు 3 గంటలు కరెంట్ ఇస్తామంటున్నారు. ఆ కరెంటుతో 10 హెచ్పీ మోటర్లు పెట్టి వ్యవసాయం చేయలేం. ఇక సాగు..రైతులకు అందని ద్రాక్షే అవుతుంది. వ్యవసాయం పడిపోయి మళ్లా వలసలు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ నుంచి వలసలు తగ్గిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్తో వ్యవసాయాన్ని సంతోషంగా చేసుకుంటున్నాం. భరోసా ఇస్తున్న సీఎం కేసీఆర్ను ఆదరిస్తాం.
-మల్లేశ్గౌడ్, కేశవరం
కాంగ్రెస్ అంటున్న 3 గంటల కరెంట్.. 10 హెచ్పీ మోటర్లతో వ్యవసాయం చేస్తే ఒక్క మడి కూడా పారదు. సాగుపై కాంగ్రెస్ నాయకులపై అవగాహన లేక మాట్లాడతున్నారు. వాళ్ల గత పాలనలో బావుల దగ్గర ఉండి… పొలాలు పారించినం. అడపాదడపా ఇచ్చే ఆ కరెంటుతో పొలం కూడా సరిగా పోతుండే. నెర్రెలు బారి ఎండిన వరిని పశువులకు మేతగా ఇస్తుండే. మళ్లీ కాంగ్రెస్ ఆ రోజులు తీసుకొస్తదా?. తెలంగాణ వచ్చినంక వ్యవసాయ రంగం తీరు మారిపోయింది. బీఆర్ఎస్ ఇస్తున్న నిరంతర కరెంటు, రైతుబంధుతో అద్భుతంగా సాగు చేస్తున్నాం. రైతులందరం కేసీఆర్ వైపే ఉంటాం.
-బద్దం మహేందర్రెడ్డి, రాంపల్లి
రాష్ట్రంలో బీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కరెంట్, నీటి సమస్యలు ఏర్పడి సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటున్న కరెంటుతో అయితే పొలాలు ఎండుతాయి. రైతులకు మళ్లీ కష్టాలు వస్తాయి. ఏం చేయాల్నో తెల్వదు. చేసిన అప్పులు తీర్చేందుకు వలసపోవాల్సి వస్తది. కాంగ్రెస్ గత పాలన రోజులు గుర్తు చేసుకుంటేనే భయమవుతోంది. బీఆర్ఎస్ హయాంలో దేశంలోనే తెలంగాణ సాగు విస్తీర్ణంలో ముందంజలో ఉంది. దీంతో తెలంగాణ అన్నపూర్ణగా ఎదిగింది. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్ను
ఆదరిస్తాం.
– మోటుపల్లి శ్రీనివాస్, నారపల్లి
రైతులకు 24 గంటల కరెంటు వద్దు… 3గంటల కరెంటు చాలు అన్న రేవంత్రెడ్డికి రైతుల కష్టాలు ఏం తెలుసు. గత కాంగ్రెస్ పాలనలో కరెంటు రాత్రి సగం, పగలు సగం ఇచ్చేది. అది కూడా లో ఓల్టేజీతో వచ్చేది. దాంతో మోటర్లు కాలిపోయేవి. రైతులు దినదిన గండంగా జీవనం సాగించేవారు. నాటి 3 గంటల కరెంటు వల్ల రైతులు రాత్రిపూట బావి దగ్గరకు వెళ్లి ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24గంటల కరెంటు ఎంతో బాగుంది. రైతులు సంతోషంగా ఉన్నారు.
– బూరుగు కృష్ణ యాదవ్, రైతు, జవహర్నగర్
కాంగ్రెసోళ్లు చెప్పినట్లు…మూడు గంటల కరెంట్, 10 హెచ్పీ మోటర్ల వాడకంతో రైతులకు భారం అవుతుంది. పంటలు పండక రైతు ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయి బతుకు భారం అవుతుంది. సన్నకారు రైతులు ఇబ్బంది పడుతరు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు ఇచ్చి సీఎం కేసీఆర్ తెలంగాణ రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటున్నారు. రైతులు వ్యవసాయాన్ని ఓ పండుగలా చేస్తున్నారు. ఉన్న చోటనే చేతి నిండా పని ఉండటంతో ఇతర ప్రాంతాలకు వలసలు పోవడం లేదు. 3 గంటల కరెంట్తో వ్యవసాయం కుంటుపడుతది. రైతులకు సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ వైపే రైతులంతా కూడా ఉండాలి.
– రణదీప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, మేడ్చల్
కాంగ్రెస్ అంటున్న 3 గంటల కరెంట్తో పొలాలు ఎండిపోతాయి. సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. రైతులకు మళ్లీ పాత రోజులొస్తయి. బావుల దగ్గర కరెంటు కోసం ఎదురు చూడాలి. ఆ వచ్చిన కరెంటుతో పొలాలు సరిగా పారవు. సాగు రైతుకు గుదిబండ అవుతది. దిగుబడి లేక రైతుల ఆదాయం తగ్గి కుటుంబ పోషణ భారంగా మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కరెంట్తో రైతులు ఉన్నకాడికి పొలాలను సాగు చేసుకుని పంటలు పండిస్తున్నారు. వ్యవసాయంతో పాటు జీవాలను పెంచుతున్నారు. రైతుకు బాసటగా నిలుస్తున్న కేసీఆర్కు అందరం అండగా నిలువాలి.
– పాండురంగం, మైసిరెడ్డిపల్లి గ్రామం, మేడ్చల్ మండలం
ఉన్నది ఊడబీకి లేనిది తగిలించుడు ఎందుకో కాంగ్రెసోళ్లే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం 24 గంటల కరెంటు ఉండటంతోనే రైతులు వ్యవసాయంతోపాటు ఇతర పనులూ చేసుకోగల్గుతున్నారు. 3 గంటలతో కరెంట్, 10 హెచ్పీ మోటర్లు పెడితే పంటలు వేసేవారు ఉండరు. కరెంట్ వాడకంలో పోటీ ఏర్పడి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. పంటల పెట్టుబడితో పాటు ఇతర ఖర్చులు భారీగా పెరిగి వ్యవసాయం చేసేవారు కరువైపోతరు. కేసీఆర్ వచ్చినంక మంచిగా కరెంటు వస్తున్నది. సాగు బ్రహ్మాండంగా చేస్తున్నాం.
-కృష్ణయ్య, దుండిగల్,మేడ్చల్ జిల్లా
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతిపనిలో తీవ్రజాప్యం ఏర్పడుతుంది. మూడుగంటల కరెంట్, 10హెచ్పీ మోటర్లు, కౌల్దారీ పద్ధతి తెచ్చేవాళ్లకు అవకాశం ఇవ్వరాదు. ఇక్కడి పరిస్థితి పై అవగాహన లేని ఢిల్లీ నేతలు ఆలోచనలు తెలంగాణ ప్రజలపై రుద్దుతారు. పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో సంక్షేమ ప్రభుత్వం వైపే ప్రజలు ఉన్నారు. సీఎం కేసీఆర్ పదేండ్లుగా రైతులకు చేయాల్సినంతా చేస్తున్నారు. మరోసారి అధికారం అప్పగిస్తే సాయంచేసే పథకాలు అమలౌతాయి. అన్నివర్గాల ప్రజల జీవనప్రమాణాలు పెరిగాయి
-నర్సింహ, దుండిగల్, మేడ్చల్ జిల్లా
మేం వస్తే 3 గంటల కరెంటు అంటున్న కాంగ్రెస్ గత పాలనలో చీకటి రోజులు చూసినం. అవి ఆలోచించుకుంటేనే గుండె, వెన్నుల వనుకుపుడుతది. రాత్రింభవళ్లు పొలాల్లో రైతులు నిద్రలేని రోజులెన్నో గడిపారు. చేతికర్ర, గొంగడితోనే సంసారం అన్నట్టుండే. ఆ వచ్చే కరెంటు సక్కగ వస్తాదంటే అది లేదు. లో ఓల్టేజ్ సమస్యతోని బోరు మోటర్లు కాలిపోయినయి. ఎవుసం ఆగమై అప్పులపాలైనం. కేసీఆర్ సర్కారు వచ్చినాక 24 గంటల కరెంటుతో వ్యవసాయం సజావుగా సాగుతున్నది. కేసీఆర్ సారుకే అండగా ఉందాం.
– సింగం ఆంజనేయులు, సర్పంచ్ లక్ష్మాపూర్
మల్లొకపారి 3 గంటల కరెంట్ మాట మాట్లాడితే కాంగ్రెస్ను బొందపెడుతం. బావుల కాడ పడుకున్న రోజులను ఇంక మరిచిపోలేదు. ఉచిత కరెంటు అని రాత్రి , పగలు కరెంటు ఇచ్చిర్రు. ఎన్నడన్న మరిచిపోయి నిద్రలోకి జారుకుంటే అంతే సంగతి. ఒక్కదొయ్య పారాలంటేనే చానా కష్టంగా ఉండే. అన్ని కష్టాలే పడ్డం. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల సమస్యలు పూర్తిగా తీరిపోయినై. 24 గంటల కరెంటును కేసీఆర్ ఇచ్చిండు. అప్పట్లో బోర్ల కోసం ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్న.అప్పులపాలు కాకుం డానాలుగేళ్లు నోట్లోకి పోతున్నయంటే బీఆర్ఎస్ పుణ్యమే.
– బందెల నర్సింహ, లక్ష్మాపూర్ గ్రామం