మహేశ్వరం, జూన్ 3 : తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్యం కొనసాగుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం దుబ్బచెర్ల క్లస్టర్లో జరిగిన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవంలో కలెక్టర్ హరీశ్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలను పూడిక తీస్తే నేడు బోర్లల్లో నీళ్లు ఉబికి వస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వేలాది ఎకరాలకు సీఎం కేసీఆర్ సాగు నీరు అందిస్తున్నారని చెప్పారు.
మహేశ్వరం నియోజకవర్గంలో రూ. 352 కోట్లు రైతు బంధు కింద జమ చేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలో 354 మంది రైతులు చనిపోతే రూ. 22 కోట్లు అందించామన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలో ఇప్పటివరకు రూ. 20 కోట్లు రుణమాఫీ జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్డీవో సూరజ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, అదనపు సంచాలకులు సుజాత, జిల్లా రైతు బంధు సమితి నాయకులు కూన యాద య్య, మండల రైతు బంధు చైర్మన్ రాఘవేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్రెడ్డి, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, మండల పార్టీ అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, వర్కిం గ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, నియోజకవర్గ కార్యదర్శి గుండెమోని అంజయ్య ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ మద్ది కరుణాకర్రెడ్డి, సర్పంచ్లు స్లీవారెడ్డి, గుత్తి పద్మపాండు, శివరాజునాయక్, సంధ్య రాజేశ్, ఎంపీటీసీ సువర్ణరాంరెడ్డి, ఎంపీడీవో నర్సింహులు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు అంగోతు గోపాల్నాయక్, బీసీ సెల్ అధ్యక్షుడు రాఘవేందర్గౌడ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు బుసగల్ల జంగయ్య బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మాజీ ఉపసర్పంచ్ దోమ శ్రీనివాస్రెడ్డి, చందు, రైతులు పాల్గొన్నారు.