రవీంద్రభారతి ఆగస్టు 10 : రైతు చట్టాలపై సినిమా హీరో ఆర్.నారాయణ మూర్తి తీసిన ‘రైతన్న’ అనే సినిమాపై అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ అభ్యుదయ హీరో ఆర్.నారాయణ మూర్తి, రైతు సంఘం నాయకులు, గద్దర్, కాంగ్రెస్ నాయకుడు ఎ.కోదండరెడ్డి, వి.వెంకట్రామయ్య, పశ్య పద్మ, తదితరులు హజరయ్యారు.
అనంతరం వక్తలు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలపై ఆర్.నారాయణ మూర్తి తీసిన సినిమా ద్వారా రైతులు పడుతున్న కష్టాలు తెలిసాయన్నారు. ఆర్.నారాయణ మూర్తికి వారు అభినందనలు తెలిపారు. రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలు, రైతులు చూడాలన్నారు. అనంతరం ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ..కేంద్రం ప్రభుత్వ తీసుకోచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు.
ఈ చట్టాల అమలు అయితే, ఏపీ, తెలంగాణ లో ఇస్తున్న ఉచిత విద్యుత్, అన్నీ ప్రభుత్వ పథకాలు రద్దు అవుతాయన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం డాక్టర్. స్వామినాథన్ కమిటీని ఏర్పాటు చేసి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల కోసమే తీసిన ఈ సినిమాను చూసి విజయవంతం చేయాలని నారాయణ మూర్తి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
నిజామాబాద్ జిల్లాలో దారుణం..నీటిగుంతలో రెండు మృత దేహాలు
20 మిలియన్ల అభిమానాన్ని పొందిన రష్మిక
Space Wedding : అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
OBC Bill: కోటాపై సీలింగ్ను ఎత్తివేయండి : అధిర్ రంజన్ చౌదరీ