హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల (Elections ) నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు ( Inspections ) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఇప్పటి వరకు రూ. 14.31 కోట్ల నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి (Election Officer), జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ ( Ronaldros ) తెలిపారు.
రెండు కోట్ల 13 వేల 088 రూపాయల విలువ గల ఇతర వస్తువులు, 20,441.89 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు చెప్పారు. 185 మందిపై కేసులు నమోదు చేసి 181 మందిని అరెస్ట్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువులపై 388 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించారని, 251 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
లైసెన్స్ గల 2842 ఆయుధాలను( Weapons) డిపాజిట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎంసీసీ ఉల్లంఘనలపై 5 ఫిర్యాదులు రాగా వాటిపై చర్యలు తీసుకున్నామన్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో రూ 28.28 లక్షల నగదు,రూ.4.72లక్షల విలువైన వస్తువులను పట్టుకొని సీజ్ చేసినట్లు ఆయన వివరించారు.