ఎల్బీనగర్ : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు ఓటు హక్కును వినియోగించు కోవాలని హయత్నగర్ సర్కిల్ ఉప కమిషనర్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఈఆర్ఓ మారుతీ దివాకర్ అన్నారు. మంగళ వారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయం వద్ద ఓటరు ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఉప కమిషనర్ మారుతీ దివాకర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు కావాలన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కును కల్పించబడిందని, దానిని వినియోగించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇఇ రమేష్బాబు, ఎఎంఓహెచ్ డాక్టర్ మంజుల వాణి, డిపిఓ బలరాంతో పాటుగా సర్కిల్లోని అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.