హైదరాబాద్ : ప్రతి ఒక్కరు టీకాను విధిగా వేసుకోవాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రిసెర్చ్(ICMR) సలహాదారు బీపీ ఆచార్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారంన మేడ్చల్ జిల్లా పరిధి శామీర్పేట జీనోమ్ వ్యాలీ లోని ఐకేపీ నాలెడ్జ్ పార్కులో దాదాపు తొంభై మంది శాస్త్రవేత్తలకు ,వివిధ కంపెనీలకు చెందిన ఉద్యోగులకు శామీర్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టీకా ఉత్సవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా బీపీ ఆచార్య మాట్లాడుతూ..కరోనా వైరస్ మహమ్మారి దేశంలో రెండో దశ ఉధృతంగా కొనసాగుతున్నందున ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు. జీనోమ్ వ్యాలిలో టీకా ఉత్సవ్ రెండో సారి నిర్వహించామని తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు వేసుకోవాలని, వ్యాక్సిన్ సెంటర్లకు వచ్చే విధంగా ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పక పాటించాలని సూచించారు. టీకా ఉత్సవ్ నిర్వహించినందుకు నిర్వాహకులకు ఉద్యోగస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో షామిర్ పేట డాక్టర్ శ్రీకాంత్, ఐకేపి ప్రతినిధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా పరీక్షల కోసం వచ్చి.. కన్నుమూశాడు
సీఎం కేసీఆర్ గొప్ప దైవభక్తుడు : మంత్రి కొప్పుల
నేల తల్లి బాగుంటేనే భవిష్యత్తు : మంత్రి ఐకే రెడ్డి
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒకే దేశంలో వ్యాక్సిన్కు రెండు ధరలా?