చిక్కడపల్లి : దేశంలో ఎక్కడా లేని విధంగా వార్డు కార్యాలయాల వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ (Deputy Speaker Padmarao Goud) అన్నారు. రాంనగర్ డివిజన్ రాజీవ్గాంధీ నగర్ కమ్యూనిటీ హాల్లో డివిజన్ వార్డు కార్యాలయాన్ని (Ward Office) ఎమ్మెల్యే ముఠాగోపాల్ (MLA Muta Gopal) తో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిపాలన సౌలభ్యంగా ఉండేందుకు వార్డు కార్యాలయాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవాలందించడమే ( Service) లక్ష్యంగా కార్యాలయాలు ఏర్పాటని అన్నారు. గతంలో ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కోసం వివిధ శాఖల కార్యాలయాల (Offices) చుట్టూ తిరుగవలసిన పరిస్థితి ఉండేదని వివరించారు. వార్డు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని వివరించారు. ప్రజలు వార్డు కార్యాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ వార్డు కార్యాలయాల ద్వారా మెరుగైన సేవలు అందుతున్నాయని వివరించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని డివిజన్లో వార్డు కార్యాలయాల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. దీంతో ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
డీఎంసీ తిప్పర్తి యాదయ్య, యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, కార్పొరేటర్ రవిచారి, బీఆర్ఎస్ రాంనగర్ డివిజన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రావులపాటి మోజస్, మన్నే దామోదర్ రెడ్డి, గాంధీనగర్, కవాడిగూడ డివిజన్ల అధ్యక్షులు రాకేశ్,శ్యామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.