కందుకూరు, జూలై 13: ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం పైనుంచి పడి జూనియర్ లైన్మన్ (జేఎల్ఎం) మృతి చెందాడు. కందుకూరు పోలీసులు, విద్యుత్ అధికారుల కథనం ప్రకారం.. చింతలపల్లి గ్రామానికి చెందిన కరుణయ్య(40) కందుకూరు విద్యుత్ కార్యాలయంలో జేఎల్ఎంగా పని చేస్తున్నాడు.
బుధవారం నేదునూరు గేటు సమీపంలో కరెంట్ పోల్ ఎక్కిన అతడు మరమ్మతు పనులు చేశాడు. ఆ తర్వాత అతడు స్తంభం దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కందుకూరు సీఐ కృష్ణంరాజు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు.