ఎల్బీనగర్ : ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి (Mla Sudeer reddy)కి కొత్తపేట డివిజన్ నాయీ బ్రాహ్మణ సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది. కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్రెడ్డి ఆధ్వర్యంలో నాయీ బ్రాహ్మణ సంఘం కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని కలిసి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటుగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనకు తామంతా మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గంలో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు.
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తామని , సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ లింగాల నాగేశ్వర్రావు, బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్గౌడ్, విశ్వేశ్వర్రెడ్డి, రాగిరి ఉదయ్ గౌడ్, నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు భాస్కర్, స్వామి, మహేష్కుమార్, భీమా, మురళి, ప్రవీణ్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.