బాలానగర్, నవంబర్ 3 : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తొలుత శంకర్ ఎన్క్లేవ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి స్వర్ణదామనగర్, మైత్రీవన్కాలనీ, సాయి కృష్ణకాలనీ, రాంరాజ్కాలనీ, ఆనంద్కాలనీ, గౌరీనగర్, సమతానగర్ కాలనీలకు చెందిన సంఘాల ప్రతినిధులు, మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో చేసిన అభివృద్ధి పనులను వివరించిన కృష్ణారావు.. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. అనంతరం హెచ్ఏఎల్ పార్క్ వద్ద నిర్వహించిన సమావేశానికి హెచ్ఏఎల్కాలనీ, ఆర్ఆర్నగర్, ఆరార్ టౌన్ షిప్, టీచర్స్కాలనీ, పీవీ ఎన్క్లేవ్, సాయి నారాయణపురి కాలనీ, రాంరెడ్డి కాలనీ, వైశ్యా బ్యాంక్ ఆఫీసర్స్కాలనీకి చెందిన ప్రతినిధులు, వార్డు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్సీ బస్తీ, బృందావన్కాలనీ, శాంతినికేతన్కాలనీ, యాదిరెడ్డికాలనీ, తిరుమల కాలనీ, యాదవబస్తీలకు చెందిన ప్రతినిధులు, సిండికేట్ బ్యాంక్కాలనీ, ఎల్బీనగర్, హస్మత్పేట ఎస్సీ బస్తీలో నిర్వహించిన సమావేశాలకు కాలనీల ప్రతినిధులు, మహిళలు భారీగా తరలివచ్చి బతుకమ్మ, బోనాలు, హారతులిచ్చి.. బొట్టపెట్టి స్వాగతం పలికారు. అనంతరం హస్మత్పేట మోడల్ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి మహిళలు, హస్మత్పేట వాసులు, లయన్స్ టౌన్ కాలనీలకు చెందిన మహిళలు, సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అన్ని బస్తీల్లో కృష్ణారావుకు ప్రజలు మద్దతు తెలిపారు. అన్ని బస్తీల ప్రజలు హారతులు, బతుకమ్మ, బోనాలతో కృష్ణారావుకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీల సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు నరేందర్గౌడ్, బల్వంత్రెడ్డి, సయ్యద్ ఎజాజ్, ఇర్ఫాన్, హరినాథ్, మక్కల నర్సింగ్, కర్రె లావణ్య, రాజేశ్వరీ, లలితతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధికి పట్టం కట్టండి
కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 3 : పదేండ్ల కాలంలో కూకట్పల్లిలో జరిగిన అభివృద్ధి కండ్లముందే కనబడుతుందని.. చేసిన పనులను చూసి ఈ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో మూసాపేట డివిజన్కు చెందిన ప్రదీప్ యాదవ్తో పాటు 500 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రవణ్కుమార్, డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ తదితరులున్నారు.
మహిళాసాధికారతకు కృషి..
సీఎం కేసీఆర్ పాలనలో మహిళా సాధికారత దిశగా పనిచేయడం జరిగిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం బాలాజీనగర్ డివిజన్లో మహిళలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించిందన్నారు.