బడంగ్పేట, మార్చి 27 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కమాలానగర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలే మా ఆత్మీయులన్నారు. ప్రజల అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బస్తీ దవాఖానలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ బస్తీల్లో దవాఖానలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎవరికీ రాలేదన్నారు. రూ.1200 వందల కోట్లతో గడ్డి అన్నారంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వరదల సమస్యను పూర్తిగా పరిష్కరించడం జరిగిందన్నారు. భవిష్యత్లో వరద ముంపు సమస్య ఉండకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్ల రూపాయలు కేటాయించి ట్రంక్లైన్ ఏర్పాట చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ చుట్టపక్కల 60 చెరువులను సుందరీకరణ చేయడం జరిగిందని తెలిపారు. చెరువులను కబ్జా కాకుండా కాపాడి సుందరీకరణ పేరుతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. చెరువులను కబ్జా కాకుండా కాపాడి సుందరీకరణ పేరుతో అబివృద్ధి చేశామన్నారు. చెరువుల దగ్గర పిల్లలకు ఆహ్లాదకర వాతావరణం ఉండటానికి పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంచినీటి సమస్యలు పరిష్కరించడానికి కొత్తగా పైపులైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో రూ.200 పింఛన్లు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండువేల పింఛన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.
– రంజిత్రెడ్డి, చేవెళ్ల ఎంపీ
తెలంగాణ రాష్ర్టానికి మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం 14 సంవత్సరాలు అవిశ్రాంతంగా పోరాటం చేసి సాధించిన తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని ఆయన అన్నారు. బంగారు తెలంగాణను సాధించడానికి నిరంతరం తపన పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 400 పై చిలుకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాకముందు ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్లాల్ చౌహాన్, బీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్రెడ్డి, మీర్పేట మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు కామేశ్రెడ్డి, కార్పొరేటర్లు గజ్జెల రామచందర్, సురేఖ రమేశ్, అనిల్ కుమార్ యాదవ్, సిద్దాల లావణ్య బీరప్ప, రాజేందర్రెడ్డి, రేఖాలక్ష్మణ్, మహేశ్వరి గోపీ యాదవ్, కో -ఆప్షన్ సభ్యులు పల్లె జంగయ్య గౌడ్, బీఆర్ఎస్ నాయకులు దిండు భూపేశ్గౌడ్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.