Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నాగోల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు రైడ్ నిర్వహించి, రాజస్థాన్కు చెందిన రమేశ్ కుమార్(35) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 4 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.