ఎల్బీనగర్/మన్సూరాబాద్/హయత్నగర్, జూన్ 21: ఉరుకులు, పరుగుల జీవితాలతో కాలం వెల్లబుచ్చుతున్న ప్రజలు తమ ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి రోజు గంట పాటు కేటాయించి యోగా, వ్యాయామం, వాకింగ్ చేయాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగోల్ డివిజన్ పరిధి జీఎస్ఐ సమీపంలోని మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై యోగా విన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యోగా చేయడం ద్వారా శరీరానికి శక్తి రావడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం యోగాసనాలు అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాగోల్ డివిజన్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, నాయకులు పోచబోయిన జగదీశ్యాదవ్, శ్రీశైలంయాదవ్, భాస్కర్, నర్రి వెంకన్న కురుమ, ఆనంద్గౌడ్, యోగా గురువు ప్రభాకర్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి తదితరులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంగణంలో డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరై యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య సుదర్శన్, నాయకులు నాంపల్లి రామేశ్వర్, పాతూరి శ్రీధర్గౌడ్, నవీన్ గుప్తా, గంగదాసు కృష్ణారెడ్డి, వెంకట్రెడ్డి, కాసాని అశోక్యాదవ్,
యంజాల సురేశ్ పాల్గొన్నారు.
సరూర్నగర్ ఇందిరా ప్రియదర్శిని పార్కులో వాకర్స్తో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రవి, అశోక్, నాయకులు శ్రీశైలం యాదవ్, చిరంజీవి, జక్కిడి మల్లారెడ్డి, భాస్కర్ గంగపుత్ర, నర్రె శ్రీనివాస్ కురుమ, బబ్బురి ఆనంద్కుమార్ గౌడ్, బేర బాలకిషన్, దర్పల్లి అశోక్, జగదీశ్ యాదవ్, విక్రాంత్రెడ్డి, రాకేశ్, కిరణ్, యోగా గురువు ప్రభాకర్ పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హయత్నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి హయత్నగర్ డిపో సాయిబాబా ఆలయం వరకు ఒలంపిక్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి, రంగారెడ్డి జిల్లా హాకీ అసోసియేషన్ సభ్యులు భాస్కర్రెడ్డి, పీఈటీలు పాండురంగారెడ్డి, రాములయ్య, రమేశ్, నాయకులు ఎర్రవెళ్లి సత్యనారాయణ, ఎర్ర ప్రేమ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.