ఘట్కేసర్ రూరల్, నవంబర్ 16 : ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అవుషాపూర్ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి తెలిపారు. అవుషాపూర్ గ్రామానికి చెందిన గుర్రం బాలమ్మ ఇటీవల వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి రూ.22 వేల చెక్కును మంజూరు చేయించారు. మంత్రి ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి చెక్కును సర్పంచ్ కావేరి మచ్చేందర్రెడ్డి లబ్ధిదారుడికి అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అయిలయ్య, పంచాయతీ సభ్యులు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సాయిలు, మండల నాయకులు శంకర్ గౌడ్, నాగరాజు, లక్ష్మా రెడ్డి, దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.
జవహర్నగర్కు చెందిన ఒకరికి..
జవహర్నగర్ : కార్పొరేషన్ పరిధిలోని సీపీఐ కాలనీకి చెందిన శాలినికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 50వేల చెక్కును డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్గుప్తా లబ్ధిదారురాలికి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సాధిక్, ఉపాధ్యక్షుడు రాజు పాల్గొన్నారు.
మేడ్చల్కు చెందిన ఒకరికి..
మేడ్చల్ : ట్యాక్సీ డ్రైవర్ బీ.రాజుకు పుట్టిన 7 నెలల కవల పిల్లలు అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. వైద్య సహాయ నిమిత్తం టీఆర్ఎస్ రాష్ట్ర నేత, టీఆర్ఎస్కేవీ ట్యాక్సీ సెక్టార్ గౌరవ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్రెడ్డి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 3 లక్షలు మంజూరు చేయించారు. మంత్రి ఆదేశాల మేరకు మంగళవారం ఆ చెక్కును రాజశేఖర్రెడ్డి లబ్ధిదారుడికి అందజేశారు. ట్యాక్సీ కార్మికులు పాల్గొన్నారు.