బడంగ్పేట, జూన్ 10: బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ను ఒక ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో రూ.15 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కోట్లా ది రూపాయలతో అభివృద్ధి పనులు, ఒక ప్రత్యేక విజన్తో కార్పొరేషన్ సమగ్రాభివృద్ధి, ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతామన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సమీకృత మార్కెట్, వైకుంఠధామాల నిర్మాణం, స్వచ్ఛతకు చిరునామాలుగా, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మం త్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1200 కోట్లతో నాలాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అందులో రూ.110 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయన్నారు.
తాగునీటి సమస్య లేకుండా చేయటానికి రూ.210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు నూతన పైపులైన్, ట్యాంకులు, రిజర్వాయర్లు కడుతున్నామన్నారు. గుర్రంగూడ, కుర్మల్గూడ, జిల్లెలగూడ, బడంగ్పేటల వద్ద రిజర్వాయర్ల పనులు జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, జల్పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని 10 చెరువులలో రూ.40 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలోని రూ. 2 కోట్ల 50 లక్షల చేపట్టనున్న కోమటికుంట చెరువు సుందరీకరణ పనులకు, 4వ డివిజన్లో బీఆర్ఆర్ కాలనీలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు పనులకు, రామిడి హిల్స్లో రూ.10 లక్షలతో సీసీ రోడ్డుకు, రూ.1.30 కోట్లతో 4,5,26 డివజన్ల పరిధిలో సబ్స్టేషన్ నుంచి శ్రీహిల్స్ కాలనీ వరకు వేయనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి శనివారం శంకుస్థాన చేశారు.
రూ.కోటి రూపాయల నిధులతో మాతగుడి నుంచి స్వేచ్ఛ నివాస్ వరకు, 4, 5 డివిజన్ల పరిధిలో నిర్మించిన రోడ్డును, డివిజన్ 4లో రూ.12లక్షలతో వెంకటేశ్వర కాలనీలో చేపట్టిన పైపులైన్ పనులకు, సౌభాగ్యనగర్లో 22 లక్షలతో ఎస్,డబ్ల్యూ పైపులైన్ పనులకు, మధురపూరిలో రూ.60 లక్షలతో వేసిన పైపులైన్ పనులను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. డివిజన్ 4లో రూ.2కోట్లతో పోచమ్మ కుంట చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత, కార్పొరేటర్లు సంరెడ్డి స్వప్న వెంకట్రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, సూర్ణగంటి అర్జున్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, పద్మ అయిలయ్య, కమిషనర్ కృష్ణమోహన్రెడ్డి, డీఈఈ అశోక్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.