పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్
మణికొండ, ఏప్రిల్ 13 : సీఎం కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని, సీఎం రాష్ట్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ అన్నారు. బుధవారం మణికొండ పురపాలక సంఘం పరిధిలోని 5, 6, 7 వార్డుల్లో సీసీ రోడ్లు, పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అధునాతన మరుగుదొడ్లను ప్రారంభించారు. ఈ మరుగు దొడ్లలో మహిళలకు రూ.5లకే శానిటరీ ప్యాడ్ మెషిన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక వాష్ రూమ్ను ఏర్పాటు చేశారు. అనంతరం మణికొండ పురపాలక సంఘ కార్యాలయంలో కొత్తగా 6 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. శానిటేషన్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. యంగిస్తాన్ సంస్థ వారు మున్సిపల్ ఆటోడ్రైవర్లకు హైజీనిక్ కిట్ను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక నిధులు మంజురు చేసి అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ నరేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఫాల్గుణ్కుమార్, డీఈ దివ్యజ్యోతి, ఏఈ రాకేశ్రెడ్డి, మేనేజర్ మల్లారెడ్డి, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, అసోసియేషన్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
యువకులు క్రీడల్లో రాణించాలి
యువకులు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ అన్నారు. నారాయణ్ఖేడ్లో జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో నార్సింగికి చెందిన యువకులు రంగారెడ్డి జిల్లా చాంపియన్షిప్ ట్రోపీతోపాటు గోల్డ్ మెడల్ సాధించిన యువకులను, కోచ్ను బుధవారం తన నివాసంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువకులు అన్ని రంగాల్లో రాణించి తెలంగాణను అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మూన్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, నవీన్, ప్రశాంత్, క్రిష్ణ, నరేశ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక కేంద్రంగా నర్కూడ
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 13 : ఆధ్యాత్మిక కేంద్రంగా నర్కూడ గ్రామం నిలిచిపోతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని నర్కూడ గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ బుర్కుంట సతీశ్ దంపతుల ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో నవ గ్రహా విగ్రహాప్రతిష్ఠాపన ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. గత మూడు రోజుల నుంచి ప్రారంభమైన ఉత్సవాలు విగ్రహాప్రతిష్ఠాపనతో ముగిశాయి. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. నర్కూడ గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందన్నారు. పురాతన అమ్మపల్లి దేవాలయంతోపాటు గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో నవగ్రహాల ప్రతిష్టాపనతో భక్తులకు దేవతామూర్తులు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్గౌడ్, గణేశ్ గుప్తా, మున్సిపల్ చైర్మన్ సుష్మ, బండ్లగూడ మేయర్ మహేందర్గౌడ్, పార్టీ అధ్యక్షుడు సురేశ్ గౌడ్, వైస్ చైర్మన్ గోపాల్యాదవ్, జడ్పీటీసీ తన్విరాజు, బుర్కంట మహేశ్, మహేశ్ యాదవ్, బల్లెపురాజులతోపాటు పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.