అమీర్పేట్:దాతల చేయూతతోనే ఆలయాలు అభివృద్ధి చెందుతాయని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ పాలక మండలి సభ్యులు కొండ్రాజు సుబ్బరాజు పేర్కొన్నారు. బుధవారం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘విరాళముల స్వీకరణ కౌంటర్’ను ఆయన దేవాలయ ఈవో ఎస్.అన్నపూర్ణ, పాలక మండలి ఛైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొండ్రాజు సుబ్బరాజు మాట్లాడుతూ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో ఆలయ ఆవరణను భక్తులకు అనుకూలంగా మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా ఆలయ అధికారులు చేపడుతున్న కార్యక్రమాలకు దాతలు కూడా ముందుకు వచ్చి తమ వంతు తోడ్పాటును అందించాలని కోరారు. తొలి విరాళంగా తానే రూ.1, 01, 116లు అందిస్తున్నట్లు తెలిపారు.
ఎస్ఆర్నగర్కు చెందిన జిమ్ నిర్వాహకులు రాజుయాదవ్ రూ. 11వేలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఈవో ఎస్.అన్నపూర్ణ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధిలో దాతలు ముందుకు వచ్చి తమ చేయూతనందిస్తుండడం అభినందనీయమని, తొలి రోజు విరాళాల సేకరణకు భక్తుల నుండి విశేష స్పందన వచ్చిందన్నారు. విరాళాలు అందించిన దాతలను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు హనుమంతరావు, బీఆర్ నారాయణరాజు, భూపాల్రెడ్డి, అశోక్యాదవ్, ఆంజనేయులు యాదవ్, శ్రీనివాస్ గుప్తా, పుట్టల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.