కేపీహెచ్బీ కాలనీ(హైదరాబాద్) : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR)ల నాయకత్వంలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని కూకట్పల్లి ఎమ్మెల్యే , అభ్యర్థి మాధవరం కృష్ణారావు (Mla Krishna Rao) వెల్లడించారు. నియోజకవర్గంలోని బాలాజీనగర్, మూసాపేట, కేపీహెచ్బీ కాలనీల పరిధిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. నగర సమస్యలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ప్రశంసించారు. మరోవైపు సమాజంలోని పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించామని వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికలప్పుడే ప్రజలకు కనిపిస్తారని, కష్టసుఖాల్లో పాలుపంచుకోరని ఆరోపించారు.
కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు బయటి వ్యక్తులను తీసుకొచ్చి హడావిడి చేస్తున్నాయే తప్పా ఎన్నికల్లో గెలిచే సత్తా వారికి లేదన్నారు. సీఎం కేసీఆర్ సుపరిపాలన, వేలాది మంది బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు, ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి విజయం సాధించడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మూసాపేటకు చెందిన యువనాయకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రవణ్కుమార్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.