కేపీహెచ్బీ కాలనీ/బాలానగర్/అల్లాపూర్ ఆగస్టు 22 : రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవరం కృష్ణారావు పేరును ప్రకటించినందుకు హర్షిస్తూ..
మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ లు కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, పగుడాల శిరీష, సబీహాబేగం, పండాల సతీశ్ గౌడ్, ముద్దం నర్సింహ యాదవ్, జూపల్లి సత్యనారాయణ, ఆవుల రవీందర్ రెడ్డి, మహేశ్వరిశ్రీహరి, మాజీ కార్పొరేటర్లు శ్రవణ్కుమార్, బాబూరావు ఉన్నారు.