బేగంపేట్ డిసెంబర్ 26: దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దళితబంధు పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సోమవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద రాంగోపాల్పేట్ డివిజన్ విక్టోరియాగంజ్కు చెందిన చంద్రశేఖర్రావుకు దళితబంధు క్రింద మంజూరైన కారును అందజేశారు. ఈ సంధర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ…ఆర్థికంగా ఎంతో వెనకబడిన దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకం ప్రవేశపెట్టి రూ. 10లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. దశల వారీగా రాష్ట్రంలోని దళితులందరికి ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోని అభివృద్ధి సాధించాలని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్పేట్ మాజీ కార్పొరేటర్ అరుణ్గౌడ్, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, అర్జున్, లావణ్య, శివకుమార్, రాజు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటా..
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. సోమవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో మంత్రిని అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి ఆధ్వర్యంలో ప్రశాంత్ కాలనీ, ఏడబ్ల్యూస్, ఎస్ఆర్టీ కాలనీ వాసులు కలిశారు. ఈ సంధర్భంగా పలు సమస్యలను విన్నవించారు. ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ, వాటర్లైన్ వంటి అనేక అభివృద్ధి పనులు జరిగినట్లు మంత్రి వివరించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తమ కాలనీలో సీసీ కెమరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి కమ్యూనిటీ ప్రోగ్రాం కింద కాలనీ వాసుల నిధులతోనూ సీసీ కెమరాలను ఏర్పాటు చేసుకోవాలని ఒకవేళ ఏమైనా నిధులు అదనంగా అవసరమైతే తన నియోజకవర్గ అభివృద్ధి నిధులనుంచి కేటాయించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు, కాలనీ వాసులు శివరాజు, శ్రీకాంత్, రాంరెడ్డి, జగదాంబ, నర్సింహా, బలరాం యశ్వంత్, రాజు, శ్రీను, రాధ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.