మేడ్చల్, జనవరి 31: కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చే బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. మంగళవారం పెద్ద ఎత్తున ప్రజలు కంటి వెలుగు శిబిరాలకు బాధితులు తరలివచ్చారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, బోడుప్పల్, జవహర్నగర్, పీర్జాదిగూడ కార్పొరేషన్లతో పాటు ఏడు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన 20 కంటి వెలుగు శిబిరాల్లో 2357 మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 530 మందికి రీడింగ్ గ్లాసెస్ ఇవ్వగా, 438 మందికి కంటి అద్దాలను ఇచ్చేందుకు చీటి రాసి ఇచ్చారు. కాగా 372 మందికి శస్త్ర చికిత్సల కోసం గుర్తించారు. కీసర మండలం భోగారంలో కంటి వెలుగు కేంద్రాన్ని ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ లాంచనంగా ప్రారంభించారు.