Hyderabad | సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): పార్ట్ టైమ్ ఉద్యోగాలతో యూట్యూబ్ లింక్లు క్లిక్ చేయడం.. ప్రముఖ హోటల్స్, వివిధ కంపెనీలకు రివ్యూలు రాయడం.. అరగంట పాటు మీరు పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తే వేలు సంపాదించవచ్చంటూ సైబర్నేరగాళ్లు చేసే మెసేజ్లకు స్పందించి.. ప్రతి నిత్యం హైదరాబాద్ మహానగరంలో కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంగళ, బుధవారాల్లో నమోదైన సైబర్నేరాలలో 90 శాతం ఈ మోసాలే ఉన్నాయి. అందులో బాధితులు కోటి రూపాయలకు పైగా పోగొట్టుకున్నారు.
రెండు రోజుల్లో జరిగిన ఘటనలు…