సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : సైబర్ క్రైం విభాగం పనితీరుపై అధికారులతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పరిధిలో నమోదవుతున్న సైబర్ నేరాలు, నేర ప్రక్రియలపై ఆయన ఆరా తీశారు. అదే విధంగా సరికొత్తగా పుట్టుకొస్తున్న సైబర్ నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం సైబర్ క్రైం విభాగంలో పనిచేసే అధికారులకు వారి పాత్ర, బాధ్యతను అప్పగించాలని సూచించారు. సైబర్ క్రైం అధికారుల్లో నైపుణ్యతను పెంచేందుకు ఐటీ, సైబర్ సెక్యూరిటీ నిపుణులతో మెలుకువలపై శిక్షణ ఇప్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్కుమార్, క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఏసీపీ గంగాధర్ పాల్గొన్నారు.