హైదరాబాద్: తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య గాలుల ప్రభావంతో తెలంగాణపై ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాగల రెండు రోజులపాటు కూడా వాతావరణం ఇలాగే ఉంటుందని అధికారులు స్పష్టంచేశారు.