ఏప్రిల్ 16న హైటెక్స్లో పదో ఎడిషన్ నిర్మాణ రంగ ప్రదర్శన
వివరాలు వెల్లడించిన క్రెడాయ్ హైదరాబాద్ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణారావు, రాజశేఖర్ రెడ్డి
హైదరాబాద్ : వచ్చే నెల 16 నుంచి 18వ తేదీ వరకు క్రెడాయ్ ఆధ్వర్యంలో ‘10వ ఎడిషన్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2021’ను హైటెక్స్ వేదికగా జరుపుతున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు పి.రామకృష్ణారావు, వి.రాజశేఖర్ రెడ్డిలు తెలిపారు. అన్ని కోవిడ్-19 మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాపర్టీ షోను చేపడుతున్నామని, కొనుగోలుదారుల సౌకర్యార్థం 74 స్టాల్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ ప్రాపర్టీ షోలో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి డెవలపర్లు, బిల్డింగ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్, కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ ఇలా ఒకే గొడుగు కిందకు అన్నింటినీ తీసుకువచ్చి ప్రదర్శన చేపడుతున్నట్లు వివరించారు.
అన్ని వర్గాల వారి బడ్జెట్లకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, రిటైల్, కమర్షియల్ కాంప్లెక్స్లు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయన్నారు. రాబో యే రోజుల్లో ఇండ్ల ధరలు పెరగకపోక ముందే తమ కలల గృహాన్ని సొంతం చేసుకునేందుకు ఇదే మంచి తరుణమని ఈ సందర్భంగా క్రెడాయ్ జనరల్ సెక్రెటరీ రాజశేఖర్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో క్రెడాయ్ ప్రతినిధులు ఆదిత్య గౌర, మురళీ మోహన్, జయదీప్, నితీష్రెడ్డి, శివరాజ్ఠాకూర్, రాజేశ్వర్, రాంబాబు పాల్గొన్నారు.