ఒడిశా పిల్లల విద్యకు నో బ్రేక్
స్వచ్ఛంద సంస్థలతో కలిసి పాఠాలు
సర్టిఫికెట్లు అందుకున్న ఇటుక బట్టీల పిల్లలు
సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అనుసంధాన కర్తగా వ్యవహరించడంతో వందలాది ఇటుక బట్టీల పిల్లలు విద్య ను అభ్యసిస్తున్నారు. వారంతా విద్యాసంవత్సరం కోల్పోకుండా ఆరు నెలలు తెలంగాణ, ఆరు నెలలు ఒడిశా రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్నారు. ఒడిశా నుంచి వలస వచ్చి ఇటుక బట్టీలలో పని చేస్తున్న కుటుంబాల పిల్లల స్వచ్ఛంద సంస్థ ఎయిడ్ ఎట్ యాక్షన్, ప్రభుత్వ సహకారంతో గత నాలుగేండ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
ఆరు నెలల పాటు విద్యాభ్యాసం ఒడియా భాషలో పూర్తి చేసిన వారికి బుధవారం సీపీ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సర్టిఫికెట్లను ఒడిశాలో చూపిస్తే వారి విద్యకు ఆట ంకం కలగకుండా విద్యా సంవత్సరం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. సీపీ మహేశ్ భగవత్ చేస్తున్న ఈ సేవా కార్యక్ర మం ద్వారా నాలుగేండ్లుగా ఒడిశాకు చెందిన 904 మంది విద్యార్థుల విద్యాభ్యాసం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది. సర్టిఫికెట్లు అందుకున్న పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు.