హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లోని లక్డీకాపూల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున్న లక్డీకాపూల్ రైల్వే బ్రిడ్జి దిగిన తర్వాత, సైఫాబాద్ పోలీస్టేషన్ ఎదురుగా ఓ భారీ కంటైనర్ బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కంటైనర్ను పక్కకు తొలగిస్తున్నారు.