కుత్బుల్లాపూర్,జూన్ 4: ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో నియోజకవర్గం ప్రజలు నానా అవస్తలు పడ్డా రు. లక్షలాది మంది నిరుపేదలు ఉపాధి నిమిత్తం పొట్టచేత పట్టుకొని నగరానికి వచ్చి జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉద్యోగాలు చేసుకొని పొట్ట పోసుకునేవారు. నా డు కరెంటు కోతలు తీవ్రతరం కావడంతో పరిశ్రమలకు పవర్ హాలీడేలు ప్రకటించారు. దీంతో కార్మికులంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వచ్చే అరకొర జీతం తో ఇంటి కిరాయిలు కట్టలేక, కుటుంబాన్ని సాకలేక అర్ధాకలితో అలమటించే వారు. పరిశ్రమలకు సైతం సరియైన ఉత్పత్తులు లేక అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు అనంతరం పరిస్థితులు మా రాయి.
సీఎం కేసీఆర్ హయాంలో 24 గంటల పాటు నాణ్యమైన కరెం టు ఇచ్చినప్పటికీ సరిపడా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు లేకపోవడంతో లో ఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉండేది. స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ దృష్టి సారించి అనేక మార్లు అధికారులతో చర్చించి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ప్రజలకు నాణ్యమైన కరెంటును అందిస్తున్నారు. అప్పటి విద్యుత్ శాఖ మంత్రితో చర్చలు జరిపి అవసరమైన నిధులు తీసుకువచ్చారు. రూ.119.25కోట్ల నిధులు మంజూరు కావడంతో అతి కొద్ది రోజుల్లోనే నియోజకవర్గంలో సబ్స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయించారు. నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలతో ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందుతున్నది. రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలం లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో విద్యత్ సమస్య తీరడం హర్షణీయం
నియోజకవర్గం వ్యాప్తంగా లో ఓల్టేజీ సమస్య లేకుం డా, 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు సరఫరా అవుతుంది. దీంతో జీడిమెట్ల పారిశ్రామిక వాడ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి వచ్చాయి. అంతేకాకుండా పాటు సూరారంకాలనీలో వందల సంఖ్యలో టెక్స్టైల్స్ పరిశ్రమలు, దూలపల్లి, గాంధీనగర్, ప్రగతినగర్ ఎలీఫ్ పారిశ్రామిక వాడ ప్రాంతాల్లో వందల సంఖ్యలో చిన్నమధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి ఫలితంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కార్మికుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో నూతనంగా వందల సంఖ్యలో కాలనీలు ఏర్పడుతున్నాయి. రూ.25 కోట్లతో 8 సబ్ స్టేషన్లు, రూ.37.61 కోట్లతో 901 త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు, రూ.45 కోట్లతో 875 విద్యుత్ స్తంభాలు, రూ.6.19 కోట్లతో విద్యుత్లైన్లను పునరుద్ధరించగా, నూతనంగా రూ.51 కోట్లతో 1435.7 ఎల్టీ లైన్లు 616.14 కిలోమీటర్లు, 33కేవీ లైన్లు 47.57 కిలోమీటర్ల పొడవు ఏర్పాటు చేశారు. అన్నిరంగాలపై ప్రభావం చూపే సమస్యను పరిష్కరించిన బీఆర్ఎస్ పరిపాలనపై ప్రజలు జేజేలు పలుకుతున్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గతంలో కంటే ఎంతో అభివృద్ధిని సాధించాం. మెరుగైన సేవలను అం దించేందుకు నిరంతరాయంగా ప్రజలకు కరెంటు సరఫరా చేస్తున్నాం. కోట్లాది రూపాయల వ్యయంతో కు త్బుల్లాపూర్ నియోజకవర్గంలో కరెంటు సమస్యల శాశ్వతపరిష్కారానికి నాంది పలికాం. దాదాపుగా రూ.263. 2 కోట్ల వ్యయంతో కొత్త సబ్స్టేషన్లు, పవర్ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వంటి ఇతర అనేక అభివృద్ధి పనులకు నాంది పలికాం.
– సత్యనారాయణ, ఏడీఈ కుత్బుల్లాపూర్