ఆర్కేపురం, నవంబర్ 27: రాష్ర్టాభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ డివిజన్లోని చెరుకుతోట కాలనీ, పోచమ్మ బస్తీ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు లోకసాని కొండల్రెడ్డి, బోయిని మహేందర్, సీనియర్ నాయకులు దర్పల్లి అశోక్, గోని శ్రీనివాస్, కడారి యాదయ్య, మహేందర్, కడారి రాజు, ఆకుల అరుణ్ కుమార్, మల్లేశ్, అంజిరెడ్డి, యాదిగౌడ్ పాల్లొన్నారు.
కందుకూరు మండల పరిధి మాదాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్లకు చెందిన 60 మంది నాయకులు సర్పంచ్ మంద సాయిలు ఆధ్వర్యంలో ఆదివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, దామోదర్గౌడ్, కృష్ణారాంభూపాల్రెడ్డి, కొండల్రెడ్డి, సర్పంచ్ గంగాపురం గోపాల్రెడ్డి, కార్తీక్, సోమయ్య పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిన కూకట్పల్లి డివిజన్ హనుమాన్నగర్కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో విప్ గాంధీ, తదితరులు
టీఆర్ఎస్ బలోపేతానికి కృషి
ఉప్పల్, నవంబర్ 27: ఉప్పల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంతోపాటు, ప్రజలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ చిలుకానగర్ ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన యువజన నాయకులు, మహిళా నేతలు ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత పిట్టల నరేశ్ ముదిరాజ్ ,నాయకులు వెంకటేశ్వర్రెడ్డి, గరిక సుధాకర్, మేకల ముత్యంరెడ్డి, పల్లె నర్సింగ్రావు, గుడి మధుసూదన్రెడ్డి, ఈరెల్లి రవీందర్రెడ్డి, రాజ్కుమార్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ముఠాగోపాల్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన అరుంధతినగర్ బస్తీ యువకులు..
ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై ..
చిక్కడపల్లి,నవంబర్27 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ అరుంధతినగర్ బస్తీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్ సమక్షంలో 100 మందికి పైగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్, ముఠా నరేశ్, రాజ్కుమార్, ప్రభాకర్, గుండు జగదీశ్ బాబు, ఎర్రం శ్రీనివాస్ గుప్తా గడ్డమీది శ్రీనివాస్, మారిశెట్టి నర్సింగ్ రావు, రవి శంకర్గుప్తా, ముఠా శివసింహ, పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిన చిలుకానగర్ ప్రాంతానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్పార్టీ నేతలు, కార్యకర్తలు
అభివృద్ధి మెచ్చి.. సంక్షేమం నచ్చి
మియాపూర్, నవంబర్ 27 : అభివృద్ధి, సంక్షేమాన్ని నచ్చి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. కూకట్పల్లి డివిజన్ హనుమాన్నగర్కు చెందిన సుమారు వంద మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ నేతృత్వంలో విప్ గాంధీ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కేవలం ప్రజలనే కాకుండా ప్రతిపక్ష పార్టీలను విశేషంగా ఆకర్షిస్తున్నాయని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో బిజేపీ, కాంగ్రెస్ జిల్లా నాయకులు విజయకుమార్, రాజేశ్రెడ్డి , శివ, తేజ, ఫాల్గుణ, అభి, శ్రీహరి, అనిల్ , రాము, రఫీ, సాదిక్, అయూబ్, యూసుఫ్, ఫిరోజ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రంగారావు, సాయిబాబా, సంజీవరెడ్డి, భాస్కర్రావు, శ్రీను, వెంకటేశ్, విఠల్ పాల్గొన్నారు.