కందుకూరు, సెప్టెంబర్ 1 :ప్రజలు ప్రతిపక్షాలను నమ్మే పరిస్థితిలో లేరని, సీఎం కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కందుకూరు మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ ముదిరాజ్తో పాటు బాచుపల్లి, లేమూరు, దెబ్బడగూడ గ్రామాలకు చెందిన 150 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి సబితారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ రెండవ స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయని అన్నారు. పార్టీలు ముఖ్యం కాదని, అభివృద్ధి ముఖ్యమని, ప్రతి పక్షాలను నమ్మి మోసపోవద్దని కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి రావడానికి అములు కాని హామీలు ఇస్తున్నారని, ప్రస్తుతం ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని తెలిపారు. అనంతరం పార్టీలో చేరిన శ్రీధర్ ముదిరాజ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితుడనై కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుక మేఘనాథ్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, లేమూరు సర్పంచ్ జంగిలి పరంజోతి, ఈర్లపల్లి భూపాల్రెడ్డి, రాంచంద్రా రెడ్డి, కాకి దశరథ ముదిరాజ్, ర్యాపాకు ప్రభాకర్రెడ్డి, మాజీ సర్పంచ్లు కొండల్రెడ్డి, గణేశ్ ముదిరాజ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, ఉప సర్పంచ్ కొండల్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, దేవేందర్, సుధాకర్, యాదగిరి, యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, కొలను విఘ్నేశ్వర్రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్రెడ్డి, రవి ముదిరాజ్, ఎంపీటీసీ రాములు, సదానంద్గౌడ్, నవీన్ కుమార్, డైరెక్టర్లు ఆనంద్, పాండు, దేవీలాల్ నాయక్, గోపిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, జైపాల్, సురేందర్రెడ్డి, సిద్దుగౌడ్, కుమార్, దావుద్లు పాల్గొన్నారు.