బన్సీలాల్పేట్, నవంబర్ 6: సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని, అందరి మద్దతుతో ఈసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పద్మారావునగర్కు చెందిన సనత్నగర్ బీజేపీ ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు కె.శ్రీధర్, వై.నర్సింగ్రావు, తమ 20 మంది అనుచరులు, హమాలీ బస్తీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బసవరాజ్ (రాజు), తన 20 మంది అనుచరులు, హమాలీ బస్తీకి చెందిన టీటీడీపీ సీనియర్ నాయకులు కె.శ్యామ్, రాందాస్, ఎల్లయ్య, రాజు, 10 మంది అనుచరులు బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
భోలక్పూర్లోని మేకలమండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు భాస్కర్, రమేశ్, మరో 10 మంది స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరారు. మంత్రి తలసాని పాఠశాల అభివృద్ధికి అందిస్తున్న సహకారం, సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయిలో అందిస్తున్న ఉచిత విద్య, పేదల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని, అందుకే తాము సనత్నగర్లో శ్రీనివాస్ యాదవ్ విజయం కోసం పని చేస్తామన్నారు. రాంగోపాల్పేట డివిజన్లోని దోభీఘాట్కు చెందిన అభిషేక్, ప్రదీప్, తేజ, యోగేశ్, వారి స్నేహితులు 15 మందికి మంత్రి తలసాని తన నివాసంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.