బడంగ్పేట్, అక్టోబర్ 26 : రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని హుడా కాలనీకి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు రైతు బంధును ఆపాలంటున్నరు, 24 గంటల కరెంటు వద్దు మూడు గంటల కరెంటు చాలంటున్నారు.. ఇలాంటి వారు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.