మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 11: ఈ నెల 30న చెతికి ఇంకు పెట్టుకొని డిసెంబర్ 3న రాష్ట్రం మొత్తం పింకు పింకు చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాంపల్లిలో శనివారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ యూత్ ప్రధాన కార్యదర్శి నెల్లుట్ల రాకేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ, వివిధ కాలనీల చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్, పార్టీ అధ్యక్షులు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు నగేష్ గౌడ్, కళావతి, కో-అప్షన్ సభ్యులు అశోక్ గౌడ్, నాయకులు అంజయ్య గౌడ్, రాములు, అంజయ్య ముదిరాజ్, పెంటయ్య గౌడ్, మల్లేష్, సాయినాథ్ గౌడ్, రమేష్ గుప్తా, పరమేష్, నర్సింహారెడ్డి, శ్రీశైలం గౌడ్, ఎలమయ్య, నర్సింహా, సురేందర్ గౌడ్, మల్లారెడ్డి, శంకర్ రెడ్డి, చంద్రస్వామి, రాజశేఖర్ గుప్తా, రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.