సికింద్రాబాద్ : నిర్మాణ దశలో ఉన్న కమ్యూనిటీ హాల్ పనులు త్వరిగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసు కోచ్చే విధంగా అధికారులు చోరవ తీసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సూచించారు. ఈ మేరకు మంగళవారం మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే సాయన్న కట్టమైసమ్మ కృష్ణానగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సీడీపీ నుంచి సుమారు రూ.40లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తు న్నట్లు తెలిపారు. పనుల్లో వేగం పెంచాలని, బస్తీవాసులకు ఉపయోగపడే విధంగా నిర్మాణ పనులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఏ శుభకార్యమైనా కమ్యూనిటీ హాల్ లో నిర్వహించుకునే విధంగా దీనిని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఆదే విధంగా వార్డులో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలో పదుల సంఖ్యలో నూతన కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని, పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో రెండవ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, నేతలు నివేదితా, అంజనేయులు, రఫిక్, ధన్రాజ్, శ్యామ్రెడ్డి, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.