అభివృద్ధి పనుల పరిశీలన.. క్రీడా ప్రాంగణాలు ప్రారంభం
దమ్మాయిగూడలో పర్యటించిన అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్
ముగిసిన పట్టణ ప్రగతి
మేడ్చల్ రూరల్ /మేడ్చల్ కలెక్టరేట్ / ఘట్కేసర్, జూన్ 18 : పట్టణ ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. చివరి రోజు పలువురు చైర్మన్లు, మేయర్లు..డివిజన్లు, వార్డుల్లో పర్యటించారు. క్రీడా ప్రాంగణాలు, అభివృద్ధి పనులను ప్రారంభించారు. క్రీడాకారులు, ప్రజలు వినియోగించుకొని, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి బాసరగేడిలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. కమిషనర్ రాములు, కౌన్సిలర్ రాజకుమారిసుధాకర్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, ఐలయ్య, భాస్కర్, ఎల్లయ్య, అనిల్, శ్రవణ్, ఏఈ సాయిరాంరెడ్డి పాల్గొన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ పర్యటించారు.
వైకుంఠధామాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణం, బస్తీ దవాఖాన, పట్టణ ప్రకృతి వనం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. నాగారం మున్సిపల్ పరిధిలోని 19, 20వ వార్డులలో పట్టణ ప్రగతిలో భాగంగా ర్యాలీ నిర్వహించి తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, కమిషనర్లు వాణి రెడ్డి, స్వామి, కౌన్సిలర్లు, డీఈఈ రఘు, మేనేజర్లు , కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. పోచారం మున్సిపాలిటీ 2వ వార్డులో చైర్మన్ కొండల్రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్ ధనలక్ష్మి కాశయ్య పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలను అందజేశారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ 4వ వార్డులో చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కమిషనర్లు సురేశ్, వసంత పాల్గొన్నారు.
పోచారం మున్సిపాలిటీలో 2వ వార్డులో కార్మికులకు చైర్మన్ కొండల్రెడ్డి ఆధ్వర్యంలో సరుకులను అందజేస్తున్న కౌన్సిలర్ ధనలక్ష్మి
తడి, పొడి చెత్తపై అవగాహన కల్పిస్తున్న నాగారం చైర్మన్ చంద్రారెడ్డి, కమిషనర్ వాణిరెడ్డి, అధికారులు