సిటీబ్యూరో, నవంబరు 21(నమస్తే తెలంగాణ): ఈ నెల 25వ తేదీన పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సాయం త్రం టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జెల నగేష్తో కలిసి పరేడ్ గ్రౌండ్లో సీఎం కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. సభా వేదిక ఏర్పాటు, సభా ప్రాంగణంలోకి వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. గ్రేటర్లోని 24 నియోజకవర్గాల నుంచి వచ్చే పార్టీ శ్రేణుల వాహనాల పార్కింగ్కు 24 ప్రాంతాలను గుర్తించామని, అక్కడ కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.
బేగంపేట్, నవంబర్ 21: తెలంగాణ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రాంగోపాల్పేట్ డివిజన్ నల్లగుట్టలోని గైదిన్బాగ్కు చెందిన రషీద్, షఫీ, అశ్విక్ల ఆధ్వర్యంలో 25 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మారేడ్పల్లిలోని మంత్రి నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమ లు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలను పొందినదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచే కాకుండా విద్యావంతులు రిటైర్ట్ ఉద్యోగులు కూడా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారన్నారు. కార్యక్రమం లో రాంగోపాల్పేట్ డివిజన్ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.