మల్కాజిగిరి, మే 22 : పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందజేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) అన్నారు. బుధవారం బోయిన్పల్లిలోని క్యాంప్ ఆఫీస్లో మల్కాజిగిరి డివిజన్ కృకా పాంప్లెక్స్కు చెందిన సర్ఫన్ సబేర్ చికిత్స కోసం రూ.1.50లక్షల సీఎంఆర్ పత్రాలను(CMRF checks) ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు ఇంటి వద్ద ఆరోగ్య సేవలు అందించడానికి బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మల్కాజిగిరిలో ఏరియా దవాఖానలు సేవలందిస్తున్నాయని అన్నారు.
దుండిగల్లోని అరుంధతి దవాఖానలో ఉచితంగా గుండే ఆపరేషన్లతో పాటు ఇతర వైద్య సేవలు అందజేస్తున్నామని తెలిపారు. పేదలు ప్రైవేటు దవఖానలకువెళ్లి లక్షల డబ్బును చెల్లించి అప్పులపాలవ వద్దని అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్లో చికిత్సల కోసం సీఎంఆర్ ఫండ్ కోసం చేస్తున్న దరఖాస్తులను వెంటనే డబ్బులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్గౌడ్, జేఏసీ వెంకన్న, రాముయాదవ్, వెంకటేష్యాదవ్, శ్రీకాంత్, మణిరత్నం, సాయి తదితరులు పాల్గొన్నారు.