కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ..
మేడ్చల్, నవంబర్ 9 : ‘సీఎం సహాయనిధి’ పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని 17వ వార్డుకు చెందిన మహేశ్వరికి మంజూరైన రూ. 58 వేలు, శ్రీనివాస్కు మంజూరైన 25 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి తన నివాసంలో మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యంతో చికిత్స పొంది, ఆర్థికంగా కుదేలైన వారిని సీఎం సహాయనిధి ఆదుకుంటున్నదని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సహాయనిధికి భారీగా నిధులు విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలన్ దేవరాజ్, టీఆర్ఎస్ నాయకులు సందీప్గౌడ్, నరేందర్ పాల్గొన్నారు.
ఘట్కేసర్ : పోచారం మున్సిపాలిటీ పరిధి… అన్నోజిగూడ లక్ష్మీనర్సింహా కాలనీకి చెందిన ఆండాలుకు రూ.60 వేలు, సాయినగర్కు చెందిన కాసుల భానుకు రూ. 40 వేలు సీఎం సహాయనిధి చెక్కులు మంజూరు కాగా చైర్మన్ కొండల్రెడ్డి అందజేశారు.
అంకుశాపుర్కు చెందిన ఎం.సునీతకు రూ. 50 వేలు, నరేందర్రెడ్డికి రూ.లక్ష సీఎం సహాయనిధి చెక్కులు మంజూరు కాగా.. ఎంపీపీ సుదర్శన్ రెడ్డి అందజేశారు.శామీర్పేట : శామీర్పేటకు చెందిన పిట్ల దండాసి (కృష్ణారావు) కిడ్నీ సమస్యతో నిమ్స్ ఆస్పత్రిలో చేరి, సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ఎల్వోసీ కింద రూ.3 లక్షలు మంజూరయ్యాయి. ఈ చెక్కును మంత్రి లబ్ధిదారుడికి అందజేశారు. ఎంపీపీ ఎల్లూభాయిబాబు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, నాయకులు పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన సాత్విక్కు రూ.35వేలు, నరసింహకు రూ.60 వేల చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. కమిషనర్ లావణ్య, కౌన్సిలర్లు , నాయకులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ : పీర్జాదిగూడ పరిధి… 20వ డివిజన్ ఇందిరానగర్ కాలనీకి చెందిన కృష్ణగౌడ్కు రూ.లక్ష, రామచంద్ర చారికి రూ.15 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా… కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ వెంకట్రెడ్డి, కార్పొరేటర్ కౌడె పోచయ్యతో కలిసి అందజేశారు. కార్పొరేటర్ మహేశ్, శ్రీరాములు పాల్గొన్నారు.